ఆంధ్ర ప్రదేశ్
Chandrababu: పహల్గం ఉగ్రదాడి మృతులకు రూ. 10 లక్షలు ఆర్ధిక సహాయం

Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు హాట్ కామెంట్స్ చేశారు. ఉగ్రదాడుల్లో మరణించిన ఏపీ వాసులకు 10 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం ప్రకటించారు చంద్రబాబు. అంతేకాదు బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాజకీయాలకు అతీతంగా మోడీకి మద్దతు ఇవ్వాల్సిన సమయం అని చిల్లర రాజకీయాలు చేయకుండా ప్రజలు భద్రత కోసం ఏకమవ్వాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.
ప్రపంచ దేశాలు ఏకమవుతూ ఉగ్రవాదంను ఖండిచాల్సిన సమయం ఉందన్నారు. రాష్ట్రంలో మరింత భద్రత ఏర్పాటు చేస్తామన్నారు. సముద్ర తీరం ఎక్కువ ఉన్న రాష్ట్రం కావటంతో కేంద్ర రాష్ట్ర బలగాలతో గస్తీ పెంచుతామన్నారు.