ఆంధ్ర ప్రదేశ్
Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు

Tirumala: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. విఐపి విరామ సమయంలో మునిసిపల్ శాఖ మంత్రి నారాయణ, ఎల్ అండ్ టీ చైర్మన్ ఎన్ సుబ్రహ్మణ్యన్, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణారెడ్డి వేర్వేరుగా కుటుంబ సభ్యులతో కలసి స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.
దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. శ్రీవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని ఎల్ అండ్ టీ చైర్మన్ ఎన్ సుబ్రహ్మణ్యన్ అన్నారు. ప్రజలు సుఖశాంతులతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.