ఆంధ్ర ప్రదేశ్
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు

Tirumala: తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ దర్శనంలో చిలుకూరు బాలజీ టెంపుల్ ప్రధాన అర్చకులు రంగరాజన్, సినీ నటుడు సుమన్ శ్రీవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
గతంలో తనపై జరిగిన దాడి నుంచి కాపాడిన స్వామి వారి పదపద్మములను నమస్కారించాలని తిరుమలకు వచ్చినట్లు ఆయన తెలిపారు. స్వామివారి హుండీ కానుకలను ఇతర కార్యక్రమాలకు వాడకుండా ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సనాతన ధర్మాన్ని పెంపొందించే విధంగా కృషి చేయాలని రంగరాజన్ సూచించారు.