సినిమా

Saif Ali Khan: సైఫ్ ఆలీ ఖాన్‌కి మరో షాక్.. రూ.15 వేల కోట్ల ఆస్తులను స్వాధీనం చేసుకోబోతున్న ప్రభుత్వం..

Saif Ali Khan: సైఫ్ ఆలీ ఖాన్‌కి మరో షాక్.. రూ.15 వేల కోట్ల ఆస్తులను స్వాధీనం చేసుకోబోతున్న ప్రభుత్వం..బాలీవుడ్ నటుడు సైఫ్ అలీకి మరో షాక్ తగలింది. పటౌడీ కుటుంబానికి ఉన్న 15 వేల కోట్ల ఆస్తిని కేంద్రం స్వాధీనం చేసుకోవడంపై ఉన్న స్టేను మధ్యప్రదేశ్ హైకోర్టు ఎత్తేసింది. దీంతో మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ఉన్న పటౌడీ కుటుంబానికి చెందిన ‘ఫ్లాగ్ హౌస్’ను కేంద్రం స్వాధీనం చేసుకునే అవకాశాలు ఉన్నాయి.

క్రికెట్ దిగ్గజం, రాజకుటుంబానికి చెందిన నవాబ్ పటౌడీ, షర్మిలా ఠాగూర్ దంపతుల కుమారుడైన సైఫ్ అలీ ఖాన్ కు భారీగా ఆస్తులు ఉన్నాయి. అందులో మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఉన్న పటౌడీ ప్యాలెస్ చాలా కీలకమైంది. దీని యాజమాన్యంపై 2015 నుంచీ కొనసాగుతున్న స్టేను మధ్యప్రదేశ్ హైకోర్టు ఎత్తేసింది.

సైఫ్‌కు వారసత్వంగా వచ్చిన 15 వేల కోట్ల భోపాల్ ఆస్తులు.. ఎనెమీ ప్రాపర్టీస్ జాబితాలో ఉన్నందున ఆయనకు దాఖలు పర్చలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది. అప్పీలేట్ ట్రిబ్యునల్‌కు వెళ్లాల్సిందిగా భోపాల్ హైకోర్టు సూచించింది. ఈ తీర్పుపై అప్పల్ చేసుకోవడానికి నెల రోజుల గడువునిచ్చింది.

సైఫ్ నాయనమ్మ సాజిదా సుల్తాన్ భాగస్వామిగా ఉన్న మూడు ఎస్టేట్లలో 2014 లో సైఫ్‌కు వాటాగా వచ్చిన భాగం గురించే వివాదం నడుస్తోంది. ఆ ఆస్తిని తనకు అప్పగించాలని ఆయన 2015లో భోపాల్ హైకోర్టును ఆశ్రయించారు. పోయిన యేడాది డిసెంబర్ 13న హైకోర్టు తీర్పు వెలువరిస్తూ అందులో తాము జోక్యం చేసుకోలేమని తెలిపింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం నడుచుకోవాలని సూచించింది.
ఎనెమీ ప్రాపర్టీ యాక్ట్ 1968 ప్రకారం దేశ విభజన, తదనంతరం 1967 లోపల ఇక్కడి నుంచి పాకిస్థాన్ వలస వెళ్లిన వారి ప్రాపర్టీలను శత్రువు ఆస్తులుగా గుర్తిస్తారు. పాకిస్థాన్ లో కూడా ఇదే రకమైన చట్టం ఉంది. అక్కడి నుండి ఇండియా తరలి వచ్చిన వారి ఆస్తులను పాక్ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది.

సైఫ్ నాయనమ్మ సజీదా సుల్తాన్ దేశంలోనే ఉన్నప్పటికీ.. ఆమె అక్క అబిదా సుల్తాన్ 1950 లో పాకిస్థాన్ వలస వెళ్లింది. ఇవి అక్క చెల్లెళ్ల ఉమ్మడి అస్తులైనందున ఎనెమీ ప్రాపర్టీస్ యాక్ట్ వర్తించింది.
ఈ చట్టం ప్రకారం 1962, 67 లో చైనా మనపై దాడి చేసిన తర్వాత దేశం వదిలి చైనా వలస వెళ్లిన వారి ఆస్తులను కూడా ఎనెమీ ప్రాపర్టీలుగా పేర్కొంటున్నారు. యుద్ధ సమయంలో చైనాను బలపర్చిన కొందరు కమ్యూనిస్ట్ నేతలు.. ఆ దేశం అమ్మాయిలు లేదా అబ్బాయిలను వివాహమాడిన వారు అలా వలస వెళ్లారు.

సైఫ్ అలీఖాన్ ట్రిబ్యునల్ కు వెళ్తే ఆయన నాయనమ్మ, ఆమె అక్క వాటాలను విభజించాల్సి ఉంటుంది. ఈయనకు అందులో కొంత ఆస్తి దక్కొచ్చు. మొత్తం ఆస్తి విలువ 15 వేల కోట్లా? అందులో సగం వాటానా అనే విషయంలో ఇంకొంత స్పష్టత రావాల్సి ఉంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button