జాతియం

Siddaramaiah: కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు ఊరట

Siddaramaiah: కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు ఊరట లభించింది. ముడా కేసును.. CBIకి బదిలీ చేయాలన్న పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. ఈ కేసును దర్యాప్తు సంస్థకు అప్పగించాలనే అభ్యర్థనను నిరాకరించింది. ప్రస్తుతం ముడా స్కామ్‌ కర్ణాటక రాజకీయాల్లో కలకలం రేపుతోంది.

‘ముడా’ స్థలాల కేటాయింపుల్లో సీఎం సిద్ధరామయ్య కుటుంబసభ్యులు లబ్ధి పొందటం, అందుకు ముఖ్యమంత్రి అధికారాన్ని దుర్వినియోగం చేసినట్లు దాఖలాలతో సామాజిక కార్యకర్త టి.జె.అబ్రహం గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. ఆయనతో పాటు స్నేహమయి కృష్ణ, ప్రదీప్‌కుమార్‌ ముఖ్యమంత్రిపై ఫిర్యాదు చేశారు. దీంతో ప్రథమ నిందితుడిగా సిద్ధరామయ్యపై కేసు నమోదైంది.

ఇక తాను ఏ తప్పు చేయలేదని, తప్పు చేసి ఉంటే ఇంతకాలం రాజకీయాల్లో ఉండడం అసాధ్యమంటున్నారు సిద్ధరామయ్య. ప్రజలు, భగవంతుడి ఆశీస్సులు ఉన్నంతవరకూ తనను ఎవరూ ఏమీ చేయలేరని పేర్కొన్నారు. ఈక్రమంలోనే ఆయన సతీమణి తమ భూములను తిరిగి ముడా సంస్థకు ఇచ్చేశారు. ఈ వ్యవహారంలో తనను విచారించేందుకు గవర్నర్ అనుమతి మంజూరుచేయడాన్ని సీఎం హైకోర్టులో సవాల్ చేసినా ఆయనకు ఎదురుదెబ్బ తగిలింది. న్యాయస్థానం ఆయన పిటిషన్‌ను కొట్టివేసింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button