తెలంగాణ
నేటి నుంచి తెలంగాణలో భూ భారతి అమలు

నేటి నుంచి తెలంగాణలో భూ భారతి అమలు కానుంది. పైలట్ మండలాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నారు. ప్రత్యేక ఫార్మాట్లో దరఖాస్తుల స్వీకరిస్తారని చెప్పిన ములుగు జిల్లా కలెక్టర్ టీఎస్ దివాకర్ మే 1 నుంచి దరఖాస్తుల పరిష్కారం ప్రారంభం అవుతుందని చెప్పారు. కాగా ఈ నెల 14న భూ భారతి పోర్టల్ను ప్రభుత్వం ప్రారంభించినట్లు గుర్తుచేశారు.
ప్రధానంగా ధరణిలో పెండింగ్లో ఉన్న సమస్యలకు సత్వర పరిష్కారం భూ భారతిలో లభిస్తుందన్నారు. రైతుల సమస్యలకు ముగింపే భూ భారతి అని చెప్పారు. ఇకపై రైతులు కోర్టులకు తిరిగే అవకాశం తక్కువే అని చెబుతున్న ములుగు జిల్లా కలెక్టర్ టీఎస్ దివాకర్.