తెలంగాణ
Bandi Sanjay: రేవంత్కు బండి సంజయ్ బహిరంగ లేఖ

Bandi Sanjay: సీఎం రేవంత్కు కేంద్రమంత్రి బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. లబ్దిదారులకు రైతు భరోసా, ఆత్మీయ భరోసా, ఇండ్లు, రేషన్ కార్డులను అందించకపోవడం దారుణమన్నారు. రాష్ట్రంలో 12వేలకు పైగా పంచాయతీలు ఉండగా మండలానికి ఒక గ్రామం చొప్పున 561 గ్రామాలను మాత్రమే ఎంపిక చేశారని ఆయన ప్రశ్నించారు.
రాష్ట్రంలో 70లక్షల మంది రైతులుంటే..ఇప్పటి వరకు 65 లక్షల మంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయకపోవడం బాధాకరమన్నారు. ఇండ్ల నిర్మాణం కోసం బడ్జెట్లో 7వేల కోట్లకు పైగా కేటాయింపులు చేసినా.. నేటికి నయా పైసా ఖర్చు చేయలేదన్నారు. రేషన్ కార్డులపై ప్రధానమంత్రి ఫోటోను ఉంచాలన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో మంజూరయ్యే ఇండ్లకు ఆ పేరునే కొనసాగించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.