తెలంగాణ

Bandi Sanjay: ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పడం ఖాయం

Bandi Sanjay: మతపరమైన రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. బీసీ జాబితాలో ముస్లింలను చేర్పిస్తే ఆమోదించే ప్రసక్తే లేదన్నారు. ఈ విషయం తెలిసి కూడా కేంద్రంపై నెట్టాలనుకోవడం మూర్ఖత్వమని అన్నారు. బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలనే చిత్తశుద్ది కాంగ్రెస్‌కు లేదని తేటతెల్లమైందన్నారు. బీసీల్లో ముస్లింలను చేర్చడంవల్ల బీసీలకు దక్కాల్సిన రిజర్వేషన్లు దక్కకుండా పోతాయని బండి సంజయ్ చెప్పారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పడం తథ్యమని కాంగ్రెస్‌కు చిత్తశుద్ది ఉంటే బీసీ జాబితాలో నుండి ముస్లింలను తొలగించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ 73, 74వ రాజ్యాంగ సవరణలను ఉల్లంఘిస్తుందన్నారు. రాజ్యాంగ పుస్తకాన్ని పట్టుకుని తిరగడం కాదు రాజ్యాంగాన్ని అమలయ్యేలా చూడాలన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button