తెలంగాణ
Bandi Sanjay: కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలి

Bandi Sanjay: కాంగ్రెస్ ప్రభుత్వానికి కేంద్రమంత్రి బండి సంజయ్ డెడ్ లైన్ విధించారు. విద్యార్ధులకు సంక్రాంతి లోపు ఫీజు రీయంబర్స్మెంట్ చెల్లించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. లేని పక్షంలో బీజేపీ ఆధ్వర్యంలో మహోద్యమం నిర్వహిస్తామని హెచ్చారించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని అల్టిమేటం జారీ చేశారు.
మన్మోహన్ సింగ్ అంత్యక్రియలపై కాంగ్రెస్ రాజకీయం చేయడం సిగ్గు చేటని ఆయన మండిపడ్డారు. మన్మోహన్ను రబ్బర్ స్టాంప్గా మార్చింది కాంగ్రెస్ కాదా అని విమర్శించారు. మన్మోహన్ తెచ్చిన ఆర్డినెన్స్ ను చింపేసి రాహుల్ గాంధీ అవమానించలేదా అని ప్రవ్నించారు. దీన్ దయాళ్ కోచింగ్ సెంటర్ ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు కేంద్ర మంత్రి బండి సంజయ్ సన్మానించారు.