బంగ్లాదేశ్లో హిందువులు, హిందూ దేవాలయాపై దాడులు

దేవుడు అన్నీ చోట్ల ఉంటాడు అంటారు. అందుకు నిదర్శనమే దేవాలయాలు ఈ ఆలయాలు గల్లీకొకటి ఉంటాయనడంలో అతిశయోక్తి లేదు. ఇవి సర్వ దేవతల నిలయాలు.. భక్తులకు దైవదర్శనం లభించే పవిత్ర స్థలాలుగా, ఆధ్యాత్మిక అనుభూతిని పొందే ప్రదేశాలుగా భావిస్తారు. భక్తునికి భగవంతునికి అనుసంధానం అయ్యేందుకు ఒక మార్గంగా దేవాలయాలు ఉన్నాయి. హిందూ దేవాలయాలు కేవలం ప్రార్థనా స్థలాలే కాకుండా, సాంస్కృతిక, సామాజిక కేంద్రాలుగా కూడా పనిచేస్తాయి
. అటువంటి వాటికి మన దేశంలో అధిక ప్రాధాన్యతనిస్తాం కానీ బంగ్లాదేశ్లో మాత్రం అటువంటి ఆలయాలు కూల్చివేయబడుతున్నాయి. తాజాగా డాకాలో ఉన్న హిందూ ఆలయాన్ని కూల్చివేయడం తీవ్ర కలకలం రేపుతోంది. ఇంతకీ అక్కడి ప్రభుత్వం ఏం చేస్తుంది..? దీనిపై భారత ప్రభుత్వం ఎలా స్పందిస్తోంది.?
గత కొంతకాలంగా బంగ్లాదేశ్లో హిందువులపై, హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. హిందూ మైనారిటీలను ముస్లిం మెజారిటీ జనాభా లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడుతోంది. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధిపతి మహ్మద్ యూనస్ దేశంలో శాంతి భద్రతలు గాడిలో ఉన్నాయని చెబుతున్నప్పటికీ అక్కడ హిందువులపై దాడులు ఆగే పరిస్థితులు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో మరోసారి హిందూ దేవాలయంపై దాడి జరిగింది. బంగ్లాదేశ్ అధికారులు ఢాకాలో ఒక తాత్కాలిక దుర్గా ఆలయాన్ని కూల్చివేశారు.
ఢాకాలోని పుర్బాచల్ ఆర్మీ క్యాంప్ నుండి బుల్డోజర్లు ఆలయ ప్రాంగణానికి చేరుకున్నాయి. దేశంలోని వివిధ హిందూ సంస్థల సమాఖ్య బంగ్లాదేశ్ సమ్మిలిత్ సనాతని జాగ్రన్ జోట్ ఢాకాలోని షాబాగ్ ప్రాంతంలో ఆలయ కూల్చివేతకు వ్యతిరేకంగా నిరసనకు పిలుపునిచ్చింది. ఈ క్రమంలోనే… హిందూ సంఘ నేతలు ఆలయాన్ని కూల్చవద్దంటూ నిరసనలు చేశారు. బుల్డోజర్ల ముందు పడుకొని నిరసన వ్యక్తం చేశారు. అయినా అధికారులు పట్టించుకోలేదు. ఆలయ ముందు నిరసన చేస్తున్న నిరసనకారులను సిబ్బంది అడ్డుకున్నారు. అక్కడి నుంచి వారిని పంపించేశారు.
చివరి ప్రయత్నంగా రథయాత్రకు వసతి కల్పించడానికి హిందువులు కూల్చివేతను రేపటి వరకు ఆలస్యం చేయాలని కోరారు. కానీ ఈ అభ్యర్థన తిరస్కరించబడింది యూనస్ ప్రభుత్వం. ఆపరేషన్ సమయంలో, ఆలయంలోని విగ్రహాలు, పూజా సామాగ్రి, ఇతర వస్తువులు ధ్వంసమయ్యాయి. బుల్డోజర్ శివుడు, కాళి దేవత విగ్రహాలను నిర్దాక్షిణ్యంగా చూర్ణం చేసి దెబ్బతీసింది. ఈ సంఘటనను యావత్త్ హిందూవులు ఖండించారు. హిందూ సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ అసహ్యకరమైన మతతత్వ ప్రవర్తన మమ్మల్ని తమను బాధించిందని హిందూ సంఘాల నేతలు ఆసహనం వ్యక్తం చేస్తున్నారు. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ఈ సంఘటనను చట్టవిరుద్ధమైన భూ వినియోగంగా ఉగ్రవాదులు నిర్మాణాన్ని కూల్చివేయాలని నినాదాలు చేస్తోందని ఆరోపించింది. మతపరమైన ప్రదేశాలు, మైనారిటీలను చిత్రహింసలు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
1970 నాటి ఆర్డినెన్స్ నెం. 24 ప్రకారం అక్రమ నిర్మాణాలను తొలగించాలని పేర్కొంటూ అధికారులు ఆ ఆలయం ఆక్రమణకు గురైన రైల్వే భూమిలో ఉందని ఆరోపిస్తున్నారు. తాత్కాలిక ప్రభుత్వం ఆధ్వర్యంలోని బంగ్లాదేశ్ రైల్వే శాఖ, ఫిల్ఖెట్ బజార్ సమీపంలోని ఆక్రమణలను తొలగించే పెద్ద ప్రయత్నంలో భాగంగా ఈ చర్యను సమర్థించింది. ఈ ఆలయం రైల్వే భూమిలో నిర్మించబడినందున అది చట్టవిరుద్ధమని అక్కడి అధికారులు చెబుతున్నారు.
అధికారుల నిర్ణయాన్ని అనేక మైనారిటీ సంస్థలు ఖండించాయి. ఈ ఆలయం పరిపాలనకు తెలియకుండానే సంవత్సరాల తరబడి ఉందని దీనిని ఎప్పుడూ చట్టవిరుద్ధంగా పరిగణించలేదని వాదిస్తోంది. గత సంవత్సరం దుర్గా పూజ జరుపుకోవడానికి, తాత్కాలికంగా ఆ స్థలాన్ని తమ పూజల కోసం ఉపయోగించుకోవడానికి రైల్వే అధికారుల నుండి అనుమతి తీసుకున్నామని కమిటీ కార్యదర్శి అర్జున్ రాయ్ తెలిపారు.
కానీ ఇప్పుడు అధికారులు ముందస్తు నోటీసు ఇవ్వకుండానే అన్నింటినీ కూల్చివేసారని మండిపడ్డారు. ఆలయ సమీపంలో ఇతర అక్రమ నిర్మాణాలు చాలా ఉన్నాయని కానీ వాటిని తొలగించకుండా కేవలం ఆలయాన్ని మాత్రమే తొలగించారని అన్నారు. ఈ సంఘటనపై తాము చాలా నిరాశ చెందామని అసహనం వ్యక్తం చేశారు.
రైల్వే భూమిపై అక్రమ ఆక్రమణలను తొలగించే నెపంతో ఢాకాలోని దుర్గా మందిర్లోని ఖిల్ఖేత్ సర్బజన్ కూల్చివేతకు బంగ్లాదేశ్లోని ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం అనుమతి ఇవ్వడాన్ని విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా తప్పుబట్టింది. ఢాకాలో దుర్గా ఆలయాన్ని ధ్వంసం చేసింనందుకు బంగ్లాదేశ్ అధికారులపై విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దుర్గా ఆలయాన్ని కూల్చివేసేందుకు తీవ్రవాదులు నినాదాలు చేస్తున్నారని తాము అర్థం చేసుకున్నామని అన్నారు. తాత్కాలిక ప్రభుత్వం ఆలయానికి భద్రత కల్పించడానికి బదులుగా ఈ సంఘటనను అక్రమ భూ వినియోగంగా చిత్రీకరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అంతటితో ఆగకుండా ఆలయాన్ని నాశనం చేయడానికి అనుమతించారని ఆయన మండిపడ్డారు. విగ్రహాన్ని వేరే చోటికి తరలించేలోపు కూల్చివేత వల్ల విగ్రహానికి నష్టం వాటిల్లిందని జైస్వాల్ అన్నారు. మతపరమైన హక్కులను కాపాడటంలో వైఫల్యాన్ని ఆయన ఖండిస్తూ హిందువులను, వారి ఆస్తులను, వారి మత సంస్థలను రక్షించడం బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. బంగ్లాదేశ్లో ఇటువంటి సంఘటనలు పునరావృతం కావడం తమకు తీవ్ర నిరాశ కలిగించిందని ఆయన అన్నారు.
కాగా ఢాకాలోని ఖిల్ఖేట్ సర్బజానిన్ దుర్గా మందిర్ దాదాపు 50 సంవత్సరాలుగా వార్షిక దుర్గా పూజను నిర్వహిస్తోంది. ఆలయ ప్రాంగణంలో కాళి దేవత విగ్రహం కూడా ఉంది. ఇక్కడ తరచుగా పూజలు చేస్తారు. ఇది రైల్వే ఆస్తిపై నిర్మించిన తాత్కాలిక ఆలయం అయినప్పటికీ… పేలవమైన స్థితిలో ఉన్నప్పటికీ ముడతలు పెట్టిన ఇనుప పలకలతో నిర్మించబడిన ఈ ఆలయం ఇస్లామిక్ దేశంలోని చిన్న హిందూ జనాభాకు ముఖ్యమైన భక్తి ప్రదేశం. కాగా ఢాకాలో అధికారులు ఆలయాన్ని కూల్చివేసిన కొన్ని గంటల తర్వాత MEA స్పందన వచ్చింది.
జూన్ 24 సాయంత్రం ఒక ముస్లిం గుంపు ఆలయంపై దాడి చేసి, దానిని ధ్వంసం చేయడానికి ప్రయత్నించింది. కర్రలతో 500 మందికి పైగా గుంపు ఆలయంలోకి ప్రవేశించిందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. భక్తులను దుర్భాషలాడి, బెదిరించిన కొద్దిసేపటికే దేశంలోని మెజారిటీ జనాభా ఒత్తిడితో ఈ చర్య తీసుకున్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి. ఆ గుంపు ప్రాంగణాన్ని ఖాళీ చేయాలని 12 గంటల అల్టిమేటం ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి.
బంగ్లాదేశ్లో పెరుగుతున్న విపరీతమైన హింసాత్మక సంఘటనలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన భారత్ మైనారిటీలందరినీ రక్షించే బాధ్యతను తాత్కాలిక ప్రభుత్వం నెరవేర్చాలని కోరింది. బంగ్లాదేశ్లో దేశద్రోహం ఆరోపణలపై అరెస్టయిన హిందూ నాయకుడి సంబంధించిన కేసు విషయంలో న్యాయంగా, పారదర్శకంగా వ్యవహరిస్తుందని భారతదేశం ఆశాభావం వ్యక్తం చేసింది.
మాజీ ప్రధాన మంత్రి షేక్ హసీనా గత సంవత్సరం ఆగస్టు 5న ప్రభుత్వ వ్యతిరేక నిరసనల తరువాత భారతదేశానికి వచ్చినప్పటి నుంచి పొరుగు దేశంలో మైనారిటీలపై, ముఖ్యంగా హిందువులపై దాడులను అరికట్టడంలో ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం విఫలమైందన్న విమర్శలు వస్తున్నాయి. ఆ తర్వాత భారత్, బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు నాటకీయంగా దెబ్బతిన్నాయి.
వార్షిక జగన్నాథ యాత్రకు కొన్ని రోజుల ముందు జరిగిన ఈ కూల్చివేత బంగ్లాదేశ్, విదేశాలలో హిందువులలో ఆగ్రహాన్ని రేకెత్తించింది. చాలా మంది ఈ చర్యను చట్టబద్ధమైన తొలగింపుగా కాకుండా మైనారిటీలను లక్ష్యంగా చేసుకుని మతపరమైన హింసకు గురిచేసేందుకు మరొక ఉదాహరణగా భావిస్తున్నారు. విగ్రహాలను గౌరవప్రదంగా వేరే చోటికి తరలించడానికి బదులుగా ఎందుకు ధ్వంసం చేశారనే ప్రశ్నలు కూడా తలెత్తాయి.