సినిమా
తిరుమల శ్రీవారి సేవలో అర్జున్ సన్నాఫ్ వైజయంతి మూవీ టీం

Tirumala: తిరుమల శ్రీవారిని అర్జున్ సన్నాఫ్ వైజయంతి మూవీ టీం దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో హీరో నందమూరి కల్యాణ్ రామ్, సినీ నటి విజయశాంతి, దర్శక నిర్మాతలు స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు.
నందమూరి కల్యాణ్ రామ్, విజయశాంతిని చేసేందుకు భక్తులు ఆసక్తి చూపారు. శ్రీవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు విజయశాంతి. 18 వ తేదీ అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమా విడుదల కానుందని చిత్రం ఘనవిజయం సాధించాలని కోరుకున్నట్టు తెలిపారు. స్వామి వారి దర్శించుకోవడం ఆనందంగా ఉన్నారు కల్యాణ్ రామ్.