ఆంధ్ర ప్రదేశ్
ఏపీలో మెగా డీఎస్సీకి సర్వం సిద్ధం

ఏపీ మెగా డీఎస్సీ పరీక్షల నిర్వహణకు సర్వం సిద్ధం చేసింది ప్రభుత్వం. ఇవాళ్టి నుంచి ఈ పరీక్షలు ప్రారంభమయ్యి జూలై 6వ తేదీ వరకు కొనసాగుతాయి. నెల రోజులపాటు జరుగనున్న ఈ పరీక్షలను రోజుకు రెండు సెషన్ల వారీగా పూర్తి చేయనున్నారు. మొత్తం 154 కేంద్రాల్లో ఈ మెగా డీఎస్సీ పరీక్షలు జరుగనున్నాయి.
ఏపీ డీఎస్సీ పరీక్షల కోసం తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఒడిశా ప్రాంతాలలో కూడా పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ మెగా డీఎస్సీలో భాగంగా మొత్తం 16వేల 347 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆన్లైన్ విధానం ద్వారా అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారు. విద్యార్థులు నిమిషం ఆలస్యంగా వచ్చినా లోపలికి అనుమతించబోమని విద్యాశాఖ అధికారులు స్పష్టం చేశారు.