ఆంధ్ర ప్రదేశ్
నటి జత్వానీ కేసులో ఇద్దరు ఐపీఎస్లకు హైకోర్టులో ఊరట

Jethwani Case: నటి జత్వాని కేసులో ఇద్దరు ఐపీఎస్లకు హైకోర్టులో ఊరట కలిగింది. సీనియర్ ఐపీఎస్ అధికారులు కాంతిరాణా, విశాల్ గున్నిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో సీఐడీ దాఖలు చేసిన అఫిడవిట్లో, ఐపీఎస్ అధికారులకు బెయిల్ ఇవ్వవద్దని, వారిని కస్టోడియల్ ఇంటరాగేషన్ చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది. అయినపప్పటికి నటి జెత్వానీ కేసులో ఐపీఎస్ అధికారులైన కాంతిరాణా టాటా, విశాల్ గున్నీలపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని ఏపీ హైకోర్టు ఆదేశించింది.