ఆర్సెలార్ లక్ష్మీ మిత్తల్తో చంద్రబాబు, లోకేష్ భేటీ

ప్రముఖ పారిశ్రామికవేత్త, ఆర్సెలార్ మిత్తల్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ లక్ష్మీమిత్తల్తో ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రులు నారా లోకేశ్, టీజీ భరత్ సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో భావనపాడులో పెట్రో కెమికల్ హబ్ ఏర్పాటుకు పెట్టుబడులకు లోకేశ్ ఆహ్వానించారు. పెట్రోకెమికల్స్ అన్వేషణకు భావనపాడు వ్యూహాత్మక ప్రాంతమని తెలిపారు.
ఏపీలో సోలార్ సెల్ తయారీ ప్లాంటు ఏర్పాటును పరిశీలించా లని విజ్ఞప్తి చేశారు. ప్రణాళికాబద్ధమైన 83.3 ఎంటీపీఏ సామర్థ్యం గల పోర్టు, విశాఖలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ ఉండటం, స్థిరమైన మౌలిక సదుపాయాలు, బలమైన ప్రభుత్వ మద్దతు పెట్రోకెమికల్ రంగంలో పెట్టుబడులకు అనుకూలతలుగా ఉంటాయని లోకేశ్ వివరించారు.
17.8 మిలియన్ టన్నుల సామర్థ్యంతో.. గ్రీన్ ఫీల్డ్ స్టీల్ప్లాంట్కు అంగీకారం లభించినట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. అనకాపల్లిలో ఏర్పాటయ్యే ఆర్సెలార్ మిట్టల్, నిప్పాన్ స్టీల్ ప్లాంట్ అతిపెద్ద ప్రాజెక్టు అని చెప్పారు. ఇటీవల అతిపెద్ద గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టులో ఒకటిగా నిలుస్తుందన్న సీఎం చంద్రబాబు.. లక్ష్మీ మిత్తల్, సీఈవో ఆదిత్య మిత్తల్తో సమావేశమమైనట్లు తెలిపారు. 17.8 మిలియన్ టన్నుల సామర్థ్యం లో.. గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్కు అంగీకారం తెలిపినట్లు చంద్రబాబు చెప్పారు.