ఆంధ్ర ప్రదేశ్
నేడు ఏపీ కేబినెట్ భేటీ.. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశం

AP Cabinet: నేడు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశం జరుగనుంది. కీలక అంశాలపై మంత్రివర్గం చర్చించనుంది. రాష్ట్రాభివృద్ధికి చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించనున్నారు.
ముఖ్యంగా అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం విధివిధానాలపై చర్చించనున్నారు. అదేవిధంగా పోలవరం-బనకచర్ల ప్రాజెక్ట్కు అనుమతులు.. ఉద్యోగుల బదిలీలపై ఏపీ కేబినెట్ చర్చించనుంది. పలు సంస్థలకు భూ కేటాయింపులపైనా సమావేశంలో చర్చించనున్నారు. ఎస్ఐపీబీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు.. ఏపీ మంత్రివర్గం ఆమోదం తెలపనుంది.
19 కీలక ప్రాజెక్టులకు సంబంధించి 33వేల కోట్ల రూపాయల పెట్టుబడులకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఎనర్జీ, టూరిజం, ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో 35వేల మందికి ఉద్యోగ అవకాశాలపై చర్చ జరుగనుంది. ఇక వచ్చేనెల 12 నాటికి కూటమి ఏడాది పాలన పూర్తి చేసుకోనుంది.