ఆంధ్ర ప్రదేశ్
Tirumala: అలిపిరి మెట్ల మార్గంలో చిరుత కలకలం

Tirumala: తిరుమల అలిపిరి మెట్లమార్గంలోని గాలిగోపురం వద్ద చిరుత సంచారం కలకలం రేపుతోంది. ఓ దుకాణం సీసీ కెమెరాల్లో చిరుత దృశ్యాలు రికార్డు అయ్యాయి. నిన్న అర్థరాత్రి ఒంటి గంట సమయంలో చిరుత సంచరించింది. భక్తులు రాకపోకలు లేని అర్థరాత్రి వేళల్లో చిన్న జంతువులను వేటాడేందుకు చిరుతలు, వన్యమృగాలు తిరుగుతుంటాయి.
అయితే భక్తులు సురక్షితంగా తిరుమల చేరుకునేలా టీటీడీ, అటవీశాఖ అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. 7వ మైలు వద్ద నుండి నరసింహస్వామి గుడి వరకు భక్తులను గుంపులుగా పంపుతున్నారు అటవీశాఖ సిబ్బంది. వన్యవృగాల నుండి ఎలాంటి ప్రమాదం కలగకుండా చేపట్టాల్సిన శాశ్వత చర్యలపై వైల్డ్ పైఫ్ నిపుణులు, టీటీడీ కసరత్తు చేస్తోంది.