తెలంగాణ

యాంకర్ స్వేచ్ఛ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి

హైదరాబాద్‌లో న్యూస్ ఛానల్ యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేగింది. చిక్కడపల్లి పీఎస్ పరిధిలోని జవహర్‌నగర్‌లో తన నివాసంలో ఫ్యానుకు ఉరేసుకుని బల వర్మణానికి పాల్పడింది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ స్వేచ్ఛ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి చేశారు. అనంతరం స్వేచ్ఛ డెడ్‌బాడీని జవహార్‌నగర్‌లోని నివాసానికి తరలించారు.

స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకోవడంతో ఆమె కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. తన అమ్మ స్వేచ్ఛ తిరిగి రాదని తెలిసి కూతురు బోరున విలపిస్తోంది. మరోవైపు తమ కూతురు చావుకి కారణం పూర్ణచంద్రనేనని స్వేచ్ఛ తల్లిదండ్రలు ఆరోపిస్తున్నారు. మరోవైపు కుటుంబకలహాలే కారణమని చిక్కడపల్లి పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

మరోవైపు స్వేచ్ఛ అకాల మరణంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెం ట్ కేటీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. స్వేచ్ఛ ధైర్యంగా ప్రశ్నించే జర్నలిస్ట్, నిబద్ధత గల రచయి త్రి, తెలంగాణ పట్ల అపారమైన ప్రేమ కలిగిన తెలంగాణ వాది అని గుర్తుచేసుకున్నారు. ఇక ఈ విషాద సమయంలో స్వేచ్ఛ కుటుంబసభ్యులకు, ముఖ్యంగా ఆమె కుమార్తెకు, తల్లికి ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు కేటీఆర్.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button