ఆంధ్ర ప్రదేశ్
Amzath Basha: ఏపీలో కోతల..కూతల ప్రభుత్వం నడుస్తోంది

Amzath Basha: ఏపీలో కొనసాగుతోంది కోతల.. కూతల.. ప్రభుత్వమని వైసీపీ ధ్వజమెత్తింది. కూటమి ప్రభుత్వం మంచి చేయకపోగా ఉన్న పథకాలను కోత పెడుతుందని, దివ్యాంగుల పెన్షన్లు తొలగిస్తోందని మాజీ ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా ఆవేదన వ్యక్తం చేశారు.
సూపర్ సిక్స్ అంటూ పథకాలను అమలు చేయడంలో చంద్రబాబు సర్కార్ చేతులెత్తేసిందని అంజాద్ భాష విమర్శించారు. 2011 నుంచి 2019 వరకు కాంగ్రెస్ టీడీపీ పాలనలోనే అక్రమ పెన్షన్లు ఉన్నాయని బాషా కడపలో ఆరోపించారు.



