తెలంగాణ
రేపు నిజామాబాద్కు అమిత్ షా

Amit Shah: రేపు తెలంగాణకు వస్తున్నారు కేంద్రమంత్రి అమిత్ షా. మధ్యాహ్నం ఒంటిగంటకు బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకోనున్న అమిత్ షా అక్కడి నుండి ప్రత్యేక హెలికాప్టర్లో నిజామా బాద్ చేరుకుంటారు. పర్యటనలో భాగంగా పసుపు బోర్డును ప్రారంభించనున్నారు. అనంతరం కిసాన్ మహాసభలో ప్రసంగించనున్నారు.
సాయంత్రం హైదరాబాద్ చేరుకోనున్న అమిత్ షా రాష్ట్ర ముఖ్యనేతలతో సమావేశం కానున్నారు. భేటీలో పలు అంశాలపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇక అధ్యక్షుడి ప్రకటనకు ముందే అమిత్ షా సమావేశం కావడంతో భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.