జాతియం

Amit Shah: ఆపరేషన్ సిందూర్.. ఉగ్రవాదానికి ధీటైన జవాబు

Amit Shah: భారత్‌ జరిపిన ఆపరేషన్‌ సిందూర్‌ ఉగ్రవాదానికి దీటైన జవాబు అని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అన్నారు. పహల్గాం దాడులతో అన్ని హద్దులూ దాటిన ఉగ్రవాదులను పూర్తిగా నిర్మూలించడానికి వారి స్థావరాలపై భారత సైన్యం మెరుపుదాడులు చేసిందన్నారు. పాక్‌లో ఉన్న ఉగ్రస్థావరాలను భారత్‌ బయటపెట్టడంతో ఆ దేశం ఉగ్రవాదులను పోషిస్తుందనే నిజం మరోసారి ప్రపంచానికి తెలిసిందన్నారు.

ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్‌ చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌ను ప్రపంచమంతా కొనియాడిందని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ బలమైన రాజకీయ సంకల్పం నిఘా సంస్థలు అందించిన కచ్చితమైన సమాచారం త్రివిధ దళాల అద్భుత ప్రదర్శన వల్లే ఆపరేషన్‌ సిందూర్‌ విజయవంతం అయ్యిందని అమిత్‌ షా అన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button