జాతియం
Amit Shah: తహవ్వుర్ రాణా అప్పగింత.. భారత్కు దౌత్య విజయం

Amit Shah: భారత్కు ముంబై ఉగ్రదాడి నిందితుడు తహవ్వుర్ రాణాను తరలించారు. అమెరికా నుంచి ప్రత్యేక విమానంలో నిందితుడ్ని భారత్కు తీసుకొచ్చారు. ఇక తహవ్వుర్ రాణాను భారత్కు అమెరికా అప్పగించడంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పందించారు.
భారత్కు ఉగ్రవాది అప్పగింత దౌత్య విజయమన్నారు అమిత్ షా. ఇది మోదీ ప్రభుత్వ దౌత్య నైపుణ్యం న్యాయం పట్ల నిబద్ధతను తెలియజేస్తోందని ఆయన వ్యాఖ్యనించారు. ఇక ఎవరి పాలనలో దాడులు జరిగాయో వారు నేరస్థులను తీసుకురాలేకపోయారని విమర్శించారు అమిత్ షా.