BRS రజతోత్సవ సభకు అంతా సిద్ధం

దారులన్నీ ఓరుగల్లు వైపే. బండెనక బండి కట్టి.. కారెనక కారు పెట్టి రజతోత్సవ సభకు కదనోత్సాహంతో తరులుతున్నారు గులాబీ శ్రేణులు. అవును 25 ఏళ్ల పండగకు ఊరువాడా కదిలింది. తెలంగాణలో 16 నెలల తర్వాత గులాబీ నేతల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది. ఇప్పటివరకు ఒక లెక్క వరంగల్ సభ తర్వాత మరోలెక్క అంటున్నారు. సిల్వర్ జూబ్లీ సభతో తమ సత్తా చాటుతామంటున్నారు గులాబీ నేతలు.
రజతోత్సవ రథాలు ఓరుగల్లు వైపు పరుగులు పెడుతున్నాయి. ఎడ్లబండ్లు, కార్లు, బస్సులు, కాలినడకన వరంగల్కు చేరుకుంటున్నాయి బీఆర్ఎస్ శ్రేణులు. ఇప్పటికే వరంగల్ అంతా గులాబీ మయంగా మారింది. ఎల్కతుర్తి సభా ప్రాంగణం కొత్త రూపును సంతరించుకుంది. సభకు పది లక్షల మంది వస్తారంటున్నారు కారు పార్టీ నేతలు. బీఆర్ఎస్కు కలిసివచ్చిన వరం గల్లో నిర్వహిస్తోన్న రజతోత్సవ సభతో కొత్త చరిత్ర సృష్టిస్తామంటున్నారు.
మరోవైపు బీఆర్ఎస్ బాహుబలి బహిరంగ సభకు కౌంట్డౌన్ షురూ అయ్యింది. తెలంగాణ అంతా గులాబీ సభపైనే చర్చించుకుంటోంది. ప్రత్యర్థి పార్టీలు సైతం ఈ సభపైనే మాట్లాడు తున్నాయ్. మరోవైపు ఓరుగల్లు గర్జనకు ముందే విపక్షాలు తర్జనభర్జన పడుతున్నాయని కారు నేతలు కౌంటర్లు ఇస్తున్నారు.
బీఆర్ఎస్ తొలిసారి నిర్వహిస్తున్న ఈ భారీ బహిరంగ సభపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మొత్తం దేశం దృష్టిని ఆకర్షించేలా సభ ఉంటుందని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. సుమా రు ఏడాది తర్వాత తిరిగి ప్రజాక్షేత్రంలో అడుగు పెడుతున్న కేసీఆర్.. ‘రజతోత్సవ సభ’లో చేసే ప్రసంగంపై ఆసక్తి నెలకొంది.