తెలంగాణ
Revanth Reddy: తెలంగాణలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం

Revanth Reddy: తెలంగాణలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. వికారాబాద్ జిల్లాలో అక్కడ బీపీసీఎల్ సహకారంతో జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటైన, పెట్రోల్ బంక్ను సీఎం ప్రారంభించారు. ఈ సందర్బంగా బంక్ నిర్వహణను పూర్తిగా మహిళలే చేపట్టడం అభినందనీయం అని కొనియాడారు.
అనంతరం రాష్ట్రంలో ఒక్కో సమస్యను పరిష్కరించుకుంటూ వస్తున్నామన్నారు. మహిళా సంఘాలను బలోపేతం చేయాలని నిర్ణయించామని గత ప్రభుత్వం మహిళా సంఘాలను పట్టించుకోలేదని విమర్శించారు.