జాతియం
విమాన ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్న యువతి

Ahmedabad: అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనలో వందల మంది మృత్యువాత పడ్డారు. అయితే విమాన ప్రమాదం నుంచి తృటిలో ఓ యువతి తప్పించుకుంది. భూమిక చౌహాన్కు 10 నిమిషాలు ఆలస్యం కావడంతో సిబ్బంది అనుమతించలేదు. దీంతో ఫ్లైట్ మిస్ అయింది. ఇక ఎయిర్పోర్టు నుంచి భూమిక వెనుదిరిగిన కాసేపటికే ఘటనా సమాచారం అందింది. అయితే అమ్మవారి దయతోనే ప్రాణాలతో బయటపడ్డానని భూమిక చౌహాన్ అన్నారు.