ఆంధ్ర ప్రదేశ్
కాకినాడ జిల్లా పిఠాపురం రూరల్ పీఎస్లో ఏసీబీ దాడులు

ACB raids: కాకినాడ జిల్లా పిఠాపురం రూరల్ పోలీస్ స్టేషన్లో ఏసీబీ దాడులు నిర్వహించారు. పిఠాపురం రూరల్ ఎస్సై గుణశేఖర్ 20వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. పిఠాపురం మండలం దొంతమూరుకు చెందిన దుర్గాప్రసాద్, గంగరాజు నుంచి ఒక కేసుకు సంబంధించి 20 వేలు లంచం డిమాండ్ చేశారు. దీంతో బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు.
బాధితులు ఎస్సైకి లంచం ఇవ్వగానే ఏసీబీ అధికారులు వలపన్ని దాడి చేసి లంచం తీసుకుంటున్న ఎస్సైతో పాటు మధ్యవర్తిగా పనిచేస్తున్న ఎస్సై వ్యక్తిగత డ్రైవర్ శివను పట్టుకున్నారు. జరిగిన ఘటనపై కాకినాడ అడిషనల్ ఎస్పీ మనీష్ దేవరాజ్ పాటిల్ శాఖపరమైన విచారణ చేపట్టారు.