ఆంధ్ర ప్రదేశ్
Chandrababu: నేడు తిరుపతిలో సీఎం చంద్రబాబు పర్యటన

Chandrababu: సీఎం చంద్రబాబు నేడు తిరుపతిలో పర్యటించనున్నారు. తిరుచానూరులో ఇంటింటా గ్యాస్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ఓ వినియోగదారుడి ఇంటికి వెళ్లి గ్యాస్ సరఫరాను పరిశీలిస్తారు. సాయంత్రం తాజ్ హోటల్కు చేరుకుని సీఎన్జీ ఆటో, ఎల్సీవీ వాహనాలను జెండా ఊపి ప్రారంభిస్తారు.
హోటల్లో ఆ కంపెనీ ప్రతినిధులతోనూ, జపాన్కు చెందిన పెట్టుబడిదారులతోనూ సమావేశమవుతారు. సాయంత్రం 6 గంటలకు బయల్దేరి స్వగ్రామమైన నారావారిపల్లికు చేరుకుంటారు.