దేశంలో మరోసారి 500 కరెన్సీ నోట్ల రద్దు.. యూట్యూబ్లో ఓ వీడియో వైరల్

దేశంలో మరోసారి 500 కరెన్సీ నోట్లను 2026 మార్చి నాటికి రద్దు చేస్తున్నారని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతున్నాయి. యూట్యూబ్లో 500 కరెన్సీ నోట్ల రద్దు అవుతున్నాయని వీడియో వైరల్గా మారింది. గత కొన్ని రోజులుగా నోట్ల రద్దుపై ప్రచారం జోరుగా సాగుతుంది. నోట్ల రద్దు ప్రచారంతో ప్రజల్లో గందరగోళ పరిస్థితి నెలకొంది.
500 నోట్ల రద్దు అసత్య ప్రచారమని కేంద్రం స్పష్టం చేసింది. 500 నోట్ల చెల్లుబాటు అవుతాయని కేంద్రం ప్రకటించింది. ఈ గందరగోళానికి 2025 ఏప్రిల్ లో ఆర్బీఐ జారీ చేసిన ఒక సర్క్యులర్ కారణమై ఉండవచ్చని భావిస్తున్నారు.
ఆ సర్క్యులర్ ప్రకారం బ్యాంకులు, వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేటర్లు తమ ఏటీఎంల ద్వారా రూ.100, రూ.200 విలువైన నోట్ల చలామణిని పెంచాలని ఆర్బీఐ ఆదేశించింది. 2025 సెప్టెంబర్ 30 నాటికి మొత్తం ఏటీఎంలలో 75 శాతం, 2026 మార్చి 31 నాటికి 90 శాతం ఏటీఎంలలో కనీసం ఒక క్యాసెట్ నుంచి రూ.100 లేదా రూ.200 నోట్లు పంపిణీ చేయాలని లక్ష్యంగా నిర్దేశించింది.