ఆంధ్ర ప్రదేశ్
Chittoor: ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి, 22 మందికి గాయాలు

Chittoor: చిత్తూరు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గంగాసాగరం వద్ద టిప్పర్ను తప్పించబోయిన ట్రావెల్స్ బస్సు.. అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. 22 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చిత్తూరు జిల్లా ఆస్పత్రికి తరలించగా.. తీవ్రగాయాలైన వారిని CMC వేలూరు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.