ఆంధ్ర ప్రదేశ్
Road Accident: కారును ఢీ కొట్టిన లారీ.. ముగ్గురు మృతి.. ఇద్దరి పరిస్థితి విషమం

Road Accident: తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో రోడ్డు ప్రమాదం జరిగింది. పొంతమూరు వద్ద కారును లారీ ఢీ కొట్టింది. ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.