జాతియం
Chhattisgarh: భారీ ఎన్కౌంటర్.. 20 మంది మావోయిస్టులు మృతి

Chhattisgarh: ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో తుపాకుల మోత మోగింది. గోగుండ అడవుల్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. జవాన్లు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 20 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఇంకా 40 మంది నక్సల్స్ ఉన్నట్టు టాక్ వినబడుతోంది. కాగా ఇప్పటికే 20 మంది నక్సల్స్ మృతదేహాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.
ఎదురుకాల్పుల్లో ఇద్దరు జవాన్లకు గాయాలైనట్లు తెలుస్తుంది. అబుజ్మడ్ అడవుల్లోనూ విస్తృతంగా కూంబింగ్ కొనసాగుతోంది. మరోవైపు అడవిని ఇంకా జల్లెడ పడుతున్నాయి భద్రతా బలగాలు. అటు బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు అమర్చిన ఐఈడీ బ్లాస్ట్ కావడంతో.. ఓ మహిళ మృతి చెందగా, మరో మహిళకు గాయాలయ్యాయి. ఇప్పటివరకు 3నెలల్లో 100మందికి పైగా మావోయిస్టులు మృతి చెందారు.