తెలంగాణ
మాజీ ఎంపీ మందా జగన్నాథంకు మంత్రుల పరామర్శ

మాజీ ఎంపీ జగన్నాథంను మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క పరామర్శించారు. తీవ్ర అనారోగ్యంతో.. ఆయన హైదరాబాద్ నిమ్స్లో చికిత్స పొందుతున్నారు. మాజీ ఎంపీ ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులు, డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు మంత్రులు. ఆయనకు మంచి చికత్స అందించాలని డాక్టర్లను ఆదేశించారు. మందా జగన్నాథం త్వరగా కోలుకొని బయటకు రావాలని ఆకాంక్షించారు.