సినిమా

Hansika Motwani: గృహ హింస కేసు.. హైకోర్టును ఆశ్రయించిన హన్సిక

Hansika Motwani: 2020లో హన్సిక మొత్వాని అన్న ప్రశాంత్ మోత్వానీ, టీవీ నటి ముస్కాన్ నాన్సీ జేమ్స్‌ల వివాహం జరిగింది. కానీ, రెండేళ్లకే వీరి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. 2020 నుంచి విడిగా జీవిస్తున్న ఈ జంటలో తాజాగా సంచలనం చోటుచేసుకుంది.

ప్రశాంత్‌పై గృహ హింస ఆరోపణలు చేసిన ముస్కాన్, అతని వేధింపుల వల్ల తనకు బెల్స్ పాల్సీ వచ్చిందని, ముఖం పక్షవాతానికి గురైందని ఫిర్యాదు చేసింది. ఈ గొడవలకు ప్రశాంత్ సోదరి హన్సిక మోత్వానీనే కారణమంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. పెళ్లిలో ఖరీదైన ఫోన్లు, విదేశీ పండ్లు, డ్రై ఫ్రూట్స్ డిమాండ్ చేసిన హన్సిక, తనను ఇబ్బంది పెట్టిందని ముస్కాన్ ఆరోపించింది.

అంతేకాదు, తన ఫ్లాట్‌ను రూ.20 లక్షలకు అమ్మి, ఉదయ్‌పూర్‌లో గ్రాండ్‌గా పెళ్లి చేయాలని ఒత్తిడి చేసిందని పేర్కొంది. ఈ ఫిర్యాదుతో ప్రశాంత్, హన్సిక, వారి తల్లి మోనాపై గృహ హింస, వరకట్న వేధింపుల కేసులు నమోదయ్యాయి. ఈ ఆరోపణలను ఖండించిన హన్సిక, తాను భర్తతో సంతోషంగా ఉన్నానని, ఈ కేసు నుంచి తనను తప్పించాలని కోర్టును కోరింది. ముందస్తు బెయిల్ కూడా తీసుకుంది. కేసు విచారణలో ఉండగా, ఈ వివాదం హాట్ టాపిక్‌గా మారింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button