News
తెలంగాణ ప్రజా ప్రతినిధులకు టీటీడీ గుడ్ న్యూస్..

ఇవాళ ఏపీ సీఎం చంద్రబాబుతో సమావేశమైన టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలపై చర్చించారు. ఈ భేటీలో వీరు ప్రజా ప్రతినిధులకు శుభవార్త చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్యేలు, ఎంపీలు ,ఎమ్మెల్సీలకు వారానికి 4 సిఫార్సు లేఖలకు ముఖ్యమంత్రి చంద్రబాబు అంగీకరించారు.
వారానికి రెండు 300రూపాయల దర్శనానికి సిఫార్సు లేఖలకు అంగీకారం తెలిపిన సీఎం చంద్రబాబు. వారానికి 2బ్రేక్ దర్శనం సిఫార్సు లేఖలు, మరో రెండు 300రూపాయల దర్శనం సిఫార్సు కలిపి మొత్తం 4లేఖలకు అంగీకారం తెలిపిన సీఎం చంద్రబాబు.