ఆంధ్ర ప్రదేశ్
జనవరి 3న లక్ష ఇళ్లకు గృహ ప్రవేశాలు..

AP: వచ్చే ఏడాది జనవరి 3న రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం లక్ష ఇళ్లకు గృహ ప్రవేశాలు నిర్వహించనుంది. ఒక జిల్లాలో సీఎం చంద్రబాబు పాల్గొని లబ్ధిదారులకు ఇంటి తాళాలు అందించి, వారితో మాట్లాడనున్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన-ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద ఇప్పటివరకు లక్ష గృహ నిర్మాణాలను పూర్తి చేసింది.
వివిధ దశల్లో ఉన్న మిగతా 6.40 లక్షల గృహ నిర్మాణాలకు ప్రభుత్వం ఇటీవలే అనుమతిచ్చింది. వీటిని 2026 మార్చి నాటికి పూర్తి చేయాలని నిర్ణయం. ఇళ్ల నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేసేందుకు మన ఇళ్లు-మన గౌరవం పేరుతో లబ్ధిదారుల్లో అవగాహన కార్యక్రమాలు.