కాకతీయ వైద్య కళాశాల ప్రిన్సిపాల్కు కోర్టు ధిక్కరణ నోటీసు

వరంగల్ జిల్లా కాకతీయ వైద్య కళాశాల ప్రిన్సిపాల్పై కంటెంప్ట్ పిటిషన్ దాఖలైంది. ర్యాగింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న డాక్టర్ సైఫ్ అలీఖాన్ సస్పెన్షన్ను ఎత్తివేసి ఆయనను పరీక్షలకు అనుమతించాలని హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. దానిని అమలు చేయకపోవడంపై కాకతీయ వైద్య కళాశాల ప్రిన్సిపల్పై కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలైంది.
డాక్టర్ ప్రీతి ఆత్మహత్య చేసుకోవడానికి సైఫ్ అలీఖాన్ కారణమంటూ ఆయనను కాలేజీ నుంచి సస్పెండ్ చేశారు. దీనిపై సైఫ్ అలీఖాన్ హైకోర్టును ఆశ్రయించాడు. దీంతో సస్పెన్షన్ను రద్దు చేస్తూ వచ్చే జనవరిలో జరిగే పీజీ పరీక్షలకు అనుమతించాలంటూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఉత్తర్వులను అమలు చేయకపోవడంతో డాక్టర్ సైఫ్ అలీఖాన్ కళాశాల ప్రిన్సిపల్ రామ్కుమార్రెడ్డిపై కోర్టు ధిక్కరణ పిటిషన్ వేశాడు. ఇక ఇరువైపుల వాదనలను విన్న న్యాయమూర్తి ప్రతివాది అయిన కాకతీయ వైద్య కళాశాల ప్రిన్సిపల్కు నోటీసులు జారీ చేశారు. విచారణను ఈ నెల 27వ తేదీకి వాయిదా వేశారు.