ఆంధ్ర ప్రదేశ్
Sharmila: దేశ ఇంటర్నల్ టెర్రరిస్ట్ ప్రధాని నరేంద్ర మోడీ

Sharmila: ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ప్రధాని మోడీపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఈ దేశ ఇంటర్నల్ టెర్రరిస్ట్ ప్రధాని నరేంద్ర మోడీ అని మండిపడ్డారు. ఇండియా నిఘా వ్యవస్థలను మోడీ వ్యవస్థలుగా మార్చారని ఆరోపించారు. ఇండియా ఇంటలిజెన్స్ అంతా మోడీ కోసం పని చేస్తోందని మోడీ కి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళ గొంతు నొక్కేందుకు నిఘా వ్యవస్థ పని చేస్తోందని ఆరోపించారు.
పహల్గామ్ ఘటనకు బాధ్యులు మోడీ,అమిత్ షానే అని విమర్శించారు. మోడీ,అమిత్ షా తక్షణం రాజీనామా చేయాలన్నారు. పాలన చేసే హక్కు లేదు చౌకిదార్ మోడీ దేశానికి కాదుకేవలం బీజేపీ కి మాత్రమేనని ఘాటు విమర్శలు చేశారు. ఏటా 2 కోట్ల మంది కాశ్మీర్ కి వెళ్తుంటారని ఇలాంటి ప్రాంతంలో సెక్యూరిటీ లోపం ఎందుకు అని షర్మిల ప్రశ్నించారు. ఇది ముమ్మాటికి భద్రత లోపమేనన్నారు.