ఆంధ్ర ప్రదేశ్
YS Sharmila: పేరుకే రైజింగ్ స్టేట్.. వైద్య సేవలకు దిక్కు లేదు

YS Sharmila: కూటమి ప్రభుత్వంపై APCC చీఫ్ వైఎస్ షర్మిల విమర్శలు గుప్పించారు. ప్రజారోగ్యంపై కూటమి ప్రభుత్వానిది అంతులేని నిర్లక్ష్యం వహిస్తుందన్నారు షర్మిల. పేరుకు రైజింగ్ స్టేట్.. కానీ వైద్య సేవలకు దిక్కులేదన్నారు. ఆరోగ్య శ్రీ సేవల కింద 3వేల 500 కోట్లు పెండింగ్ పెట్టడం సిగ్గుచేటన్నారు.
వైద్య సేవలు నిలిపివేసే వరకు బకాయిలు విడుదల చేయకుండా ఉండటం దారుణమన్నారు. పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగానే కూటమి ప్రభుత్వం బకాయిలు పెండింగ్ పెట్టిందని ఆరోపించారు. తక్షణమే వైద్య సేవలను తిరిగి ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని షర్మిల డిమాండ్ చేసారు.