Jagan: రాష్ట్రంలో రైతులు అవస్థలు పడుతున్నారు

Jagan: మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ ప్రకాశం జిల్లాలో పర్యటించారు. గత కొంతకాలంగా పొగాకు రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై జగన్ రైతులును పరామర్శించారు. పొదిలి వేలం కేంద్రం వద్దకు వెళ్లిన జగన్, రైతులతో ముఖాముఖి మాట్లాడి వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. అధికారులతో వేలం కేంద్రం లోని బోర్డు అధికారులతో మాట్లాడిన జగన్, బేళ్లు తిరస్కరణకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అయితే జగన్ పర్యటనలో కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ, వైసీపీ శ్రేణుల రాళ్లు రువ్వుకున్నాయ్.
ప్రకాశం జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి జగన్ పర్యటించారు. హెలికాప్టర్ ద్వారా హెలిప్యాడ్ కు చేరుకున్న జగన్ వైసీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. జగన్ చూసేందుకు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున రోడ్ు వెంట నిలబడ్డారు. అక్కడ నుండి కాన్వాయ్ లో జగన్ దాదాపు రెండున్నర కిలోమీటర్ల పాటు ప్రజలకు అభివందనం చేస్తూ ముందుకు సాగారు. అనంతరం వేలం కేంద్రం వద్దకు చేరుకున్న జగన్ పోగాకు బోర్డు అధికారులతో మాట్లాడి వివరాలు అడిగితెలుసుకున్నారు. అధిక సంక్యలో రోజు బేళ్ల తిరస్కరణకు ఎందుకు గురవతున్నాయని జగన్ అధికారలు అడిగారు.
అనంతరం పొగాకు రైతులతో ముఖాముఖి మాట్లాడారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్న జగన్, వైసీపీ పార్టీ రైతలుకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం తక్షణమే మార్కె ఫెడ్ ద్వారా పొగాకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఇప్పటి వరకు జిల్లాలో మృతిచెందిన పొగాకు రైతలుకు ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించాలన్నారు. గత ప్రభుత్వంలో పొగాకు రైతలను ఆదుకునేందుకు వైసీపీ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని తెలిపిన జగన్, కూటమి ప్రభుత్వం రైతల పట్ల నిర్లక్ష్య దోరణితో వ్యవహరిస్తుందని దుయ్యబట్టారు.
అయితే జగన్ కాన్వాయ్ వేలం కేంద్రం కు వెళ్లే దారిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పొదిలి చన్న బస్టాండ్ జంక్షన్లో టీడీపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశాయి. ఇటీవల జగన్ కు చెందిన ఓ మీడియా ఛానల్ లో మహిళలను కించపరుస్తూ జరిగిన డిబైట్ పై జగన్ క్షమాపణలు చెప్పాలని పలువురు మహిళలు నిరసన వ్యక్తం చేశారు. నల్లబ్యాడ్జీలు ధరించి, ఫ్లకార్డులను పట్టుకుని జగన్ కాన్వాయ్ ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు. అయితే అవేమి పట్టించుుకోని జగన్ ముందుకు సాగారు.
కానీ కాన్వాయ్ ముందుకు వెళ్లిన తర్వాత వైసీపీ శ్రేణులు, శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న టీడీపీ శ్రేణులపై రాళ్ళు, చెప్పులు విసిరారు. దీంతో వారు కూడా ప్రతిదాడిగా రాళ్లు, బాటిల్స్ కాన్వాయ్ పై విసారారు. దీంతో అక్కడ కొంత ఉద్రక్తిత చోటుచేసుకుంది. అయితే వెంటనే పోలీసులు రగంగలోకి దిగి, నిరసన కారులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఈ ఘటనలో పలువురు టీడీపీ నాయకులతో పాటు ఓక కానిస్టేబుల్ కు గాయాలయ్యాయ్. గాయపడిన వారిని స్ధానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
వైసీపీ నాయకులు, కార్యకర్తలు కావాలనే తమపై దాడి చేసారని టీడీపీ శ్రేణులు చెప్తుండగా, కావాలని వారే ముందు తమపై రాళ్లు రువ్వారని వైసీపీ వారు చెప్తున్న పరిస్ధితి. ఏది ఏమైనప్పటికి ప్రకాశం జిల్లాలో జరిగిన జగన్ పర్యటన ఉద్రికత్తల మద్య సాగిందనే చెప్పుకోవాలి. జరిగిన ఘటన పై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి మరీ.