ఆంధ్ర ప్రదేశ్

YouTuber Tirumala Reddy: యూట్యూబర్ తిరుమల రెడ్డి దారుణ హత్య

YouTuber Tirumala Reddy: కర్నూలు జిల్లాలో యూ ట్యూబర్ తిరుమల రెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. అయితే ఈ హత్యకు భూ వివాదమే కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. గుంతకల్లు మండలంలోని సంగాల గ్రామంలో హంద్రీనీవా కాలువ వద్ద గత సోమవారం తిరుమల రెడ్డి శవమై కనిపించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.

ఈ నేపథ్యంలోనే భూమి విషయమై తన భర్తకు సంగాల గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి మధ్య వివాదం ఉందని మృతుడి భార్య కామేశ్వరి తెలిపారు . దీంతో ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. ఈ ఘటనలో సంగాలకు చెందిన వ్యక్తే కాకుండా పలువురి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button