తెలంగాణ
Hyderabad: రెచ్చిపోయిన గంజాయి బ్యాచ్.. కర్రలు, రాడ్లతో యువకులపై దాడి

Hyderabad: హైదరాబాద్లో గంజాయి బ్యాచ్ రెచ్చిపోయింది. చందానగర్లో బైక్పై వెళ్తున్న యువకులపై దాడి చేశారు. గంజాయి మత్తులో యువకులపై దాడి చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. కర్రలు, రాడ్లతో గంగారం యువకులపై దాడి చేసినట్లు తెలిపారు. దాడిలో యువకులు తీవ్రంగా గాయపడగా చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసు లు దర్యాప్తు చేపట్టారు.