ఆంధ్ర ప్రదేశ్
YCP: త్వరలో మరికొంతమంది వైసీపీకి గుడ్ బై..?

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వైసీపీకి ఉక్కపోత కంటిన్యూ అవుతోంది. తాజాగా మరికొంతమంది వైసీపీకి గుడ్బై చెప్పే యోచనలో ఉన్నట్లు సమాచారం. మరో 8 మంది వైసీపీ ఎమ్మెల్సీలు పార్టీని వీడే యోచనలో ఉన్నట్లు టాక్ వినబడుతోంది. ఇప్పుడు ఈ విషయం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
గతేడాది నలుగురు ఎమ్మెల్సీలు రాజీనామా చేయగా.. ఇంకా వాటికి ఆమోదం లభించలేదు. అయితే తాజాగా మర్రి రాజశేఖర్ రాజీనామా చేయడంతో పొలిటికల్ హీట్ పెరిగింది. ఇప్పుడు మర్రి బాటలోనే తాము నడిచేందుకు సిద్ధమంటూ కూటమి ప్రభుత్వానికి వైసీపీ ఎమ్మెల్సీలు సంకేతాలు పంపినిట్లు తెలుస్తుంది. ఇప్పటికే పోతుల సునీత, కల్యాణ్ చక్రవర్తి కర్రి పద్మశ్రీ జయమంగళ వెంకటరమణ రాజీనామా చేయగా నిన్న రాజశేఖర్ రాజీనామాతో వైసీపీ అసంతృప్తుల సంఖ్య ఐదుకు చేరింది.