AP Assembly: ఏపీ అసెంబ్లీ నుంచి వైసీపీ బాయ్కాట్

AP Assembly: ఏపీ అసెంబ్లీ నుంచి వైసీపీ నేతలు వాకౌట్ చేశారు. ప్రతిపక్ష హోదా ఇవ్వాలని అసెంబ్లీలో ముక్తకంఠంతో నినదించామన్నారు బొత్స సత్యనారాయణ. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి ఎంతో విలువ ఉంటుందన్నారు ఆయన.
ప్రజల గొంతుక వినిపించే బాధ్యత ప్రతిపక్షానిదేనన్న బొత్స సభలో రెండే పక్షాలని అందులో ఒకటి ప్రతిపక్షం, రెండోది అధికార పక్షమని చెప్పారు. కూటమి పాలనతో ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారంటూ విమర్శించారు.
ప్రతిపక్ష హొదా ఇవ్వకపోవడం అంటే.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసినట్లే అంటోంది వైసీపీ. ప్రతిపక్షం గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారంటూ కూటమి పాలనపై మండిపడ్డారు. ప్రజా స్వామ్యాన్ని కాపాడే బాధ్యత గవర్నర్కు లేదా అంటూ వైసీపీ క్వశ్చన్ చేస్తోంది.
కావాలనే ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదంటూ వైసీపీ ఆరోపిస్తోంది. 11 మందిని ఎదుర్కొనే దమ్ము, ధైర్యం లేదా అంటూ నిలదీస్తోంది. కూటమి చేస్తోన్న దోపిడినీ భయటపెడతామంటున్నారు.