Kadapa: వైకాపా వీరంగం.. టీడీపీ జెండాలు దహనం

Kadapa: కడప జిల్లా పులివెందులలో వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. మహానాడు సందర్భంగా కట్టిన టీడీపీ జెండాలు మిగిలిన వాటిని కసిదీరా తొలగించి కాల్చి బూడిద చేశారు. ఈ ఘటనకు సంబంధించి నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహానాడు సందర్భంగా కదిరి రింగ్ రోడ్డులో టీడీపీ జెండాలు కట్టారు. అయితే వీటిని కొంతమంది తొలగించారు. అనంతరం నిప్పు పెట్టారు.
దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లారు. ఘటనకు పాల్పడిన నలుగురిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. పట్టుబడ్డవారిలో బాలాజీ నాయక్ వైయస్ రాజశేఖర్ రెడ్డికి వీరాభిమాని.
అతను టీడీపీ తోరణాలు తొలగిస్తుండగా అతని బావమరిది తిరునాద్ నాయక్ తన మిత్రులతో వచ్చాడు. అయితే టీడీపీ తోరణాలు తొలగించి వైయస్ విగ్రహానికి బాలాజీ నాయక్ పాలాభిషేకం అభిషేకం చేయాలనుకున్నాడు, కానీ జెండాలు తొలగించే క్రమంలో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. దొరికినవారిలో ముగ్గురు మైనర్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.