ఆంధ్ర ప్రదేశ్
Botsa VS Atchannaidu: మండలిలో మాటల యుద్ధం.. బొత్స వర్సెస్ అచ్చెన్నాయుడు

Botsa VS Atchannaidu: ఏపీ మండలిలో టీడీపీ-వైసీపీ మధ్య డైలాగ్ వార్ జరుగుతోంది. ఐదేళ్లు రాష్ట్రాన్ని విధ్వంసం చేశారని కూటమి నేతలు అన్నారు. అయితే విధ్వంసం అని పదేపదే అంటున్నారు అవి ఏంటో చెప్పాలంటూ బొత్స డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే అమరావతిని స్మశానం అంటూ బొత్స సత్యనారాయణ కామెంట్ చేశారు. దీంతో బొత్స వ్యాఖ్యలపై కూటమి నేతల అభ్యంతరం తెలిపారు.
ఐదేళ్లు స్మశానం నుంచే పాలించారా? అంటూ అచ్చెన్నాయుడు క్వశ్చన్ చేశారు. అమరావతిలో నిర్మాణాలను ఐదేళ్లు నీటిలో ముంచారు మూడు రాజధానుల పేరుతో నాటకాలాడారంటూ అచ్చెన్నా ఆగ్రహం వ్యక్తం చేశారు.