తెలంగాణ
రైలు పట్టాలపై కారు నడుపుతూ యువతి హల్చల్

రైలు పట్టాలపై ఓ యువతి హల్చల్ చేసింది. ఏకంగా రైలు పట్టాలపై కారు నడిపింది. నాగులపల్లి-శంకర్పల్లి మార్గంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. యువతి పట్టాలపైకి కారు తీసుకురావడంతో గమనించిన లోకోపైలట్ రైలు ఆపేశాడు. దీంతో గంటల తరబడి రైళ్ల రాకపోకలకు అంతరాయం కల్గింది.
ఇది గమనించిన స్థానికులు కారును అడ్డగించగా వారిని చాకుతో బెదిరించింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని యువతిని అదుపులోకి తీసుకున్నారు.