తెలంగాణ
Hyderabad: మహిళ హల్చల్… న్యాయం చేయాలని పెట్రోల్ బాటిల్ తో ఆందోళన

Hyderabad: హైదరాబాద్ ఉప్పల్లో మహిళ హల్చల్ చేసింది. హైడ్రా కూల్చివేతకు నిరసనగా ఆందోళన చేపట్టింది. పెట్రోల్ పోసుకుని చనిపోతానంటూ బైటాయించింది. చిలకానగర్ డివిజన్ కళ్యాణపురి పార్క్ వద్ద ఘటన వెలుగులోకి వచ్చింది.
తొలుత పార్క్ దగ్గర ఆక్రమణపై ఫిర్యాదు రావడంతో కూల్చివేశారు. అయితే తన పాల బూతును అన్యాయంగా కూల్చారంటూ మహిళ పోరుబాట పట్టింది. పెట్రోల్ బాటిల్ పట్టుకుని జీహెచ్ఎంసీ వాహనాల ముందు నిరసన చేపట్టింది.