తెలంగాణ
నిజామాబాద్లో మహిళ ఆత్మహత్యాయత్నం

Nizamabad: నిజామాబాద్లో మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేగింది. ఇందల్వాయి మండలం తీర్మాన్ పల్లిలో ఘటన చోటుచేసుకుంది. తన వ్యవసాయ భూమి కొనుగోలు చేసిన వ్యక్తి డబ్బులు ఇవ్వకపోవడంపై వివాదం రాజుకుంది.
అయితే డబ్బులు చెల్లించకుండా తనపై దాడి చేశారంటూ పురుగుల మందు తాగి మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. సెల్ఫీ వీడియోలో తన బాధను చెప్పుకుంది. చికిత్స నిమిత్తం మహిళను ఆసుపత్రికి తరలించారు స్థానికులు.