తెలంగాణ

భద్రాద్రి కొత్తగూడెం ఐటీఐ కాలేజ్‌కు మోక్షమెప్పుడు

భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో గిరిజన విద్యార్థులకు సాంకేతిక విద్య అందని ద్రాక్షగా మారింది. జిల్లాలో రూ.5.5కోట్లతో కట్టిన స్పెషల్​ఐటీఐ బిల్డింగ్​ను నిరుపయోగంగా పెట్టారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోని స్టూడెంట్స్​ నక్సల్స్​​ వైపు ఆకర్షించకుండా ఏడేండ్ల కిందట జిల్లాకు కేంద్రం స్పెషల్​ ఐటీఐని శాంక్షన్​ చేసింది.

గిరిజన పిల్లలకు టెన్నికల్​ ఎడ్యుకేషన్​ పూర్తిస్థాయిలో ఫ్రీగా అందించేందుకు స్పెషల్​ ఐటీఐ బిల్డింగ్​తో పాటు హాస్టల్​కు రూ. 5.5కోట్లను కేంద్రం రిలీజ్​ చేసింది. చుంచుపల్లి మండలంలో బిల్డింగ్​ నిర్మాణ పనులను పంచాయతీ రాజ్​ ఇంజినీరింగ్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టారు. ఏడాదిన్నర కిందట బిల్డింగ్​ పూర్తయినా ఇప్పటి వరకు అందుబాటులోకి తీసుకురావడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు.

స్పెషల్​ ఐటీఐ కాలేజ్​ బిల్డింగ్​తో పాటు ల్యాబ్​లు, హాస్టల్​ భవనాలను నిర్మించిన పంచాయతీరాజ్​ ఆఫీసర్లు కాంపౌండ్​ వాల్​ నిర్మాణాన్ని మర్చిపోయారు. కరెంట్​ సప్లై ఇవ్వలేదు. హాస్టల్​ బిల్డింగ్​ ముందు కందకాలు పూడ్చలేదు. కానీ బిల్డింగ్​ పూర్తి అయినట్టుగా చెబుతూ హ్యాండోవర్​ చేసుకోవాలని కొత్తగూడెంలోని ఐటీఐ ప్రిన్సిపాల్​పై ఒత్తిడి తెచ్చారు. పనులన్నీ పూర్తి చేస్తేనే హ్యాండోవర్​ చేసుకుంటానని ప్రిన్సిపాల్​ ఖరాఖండిగా చెప్పారు. ఈ క్రమంలో కాలం గడుస్తోంది తప్ప క్లాసులు నిర్వహించేందుకు బిల్డింగ్​ అందుబాటులోకి రావడం లేదు.

ఫలితంగా కోట్లతో నిర్మించిన బిల్డింగ్​ లు అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా మారింది. నిత్యం మందుబాబులు అక్కడ సిట్టింగ్​వేస్తున్నారు. ఈ క్రమంలో వెంటనే పెండింగ్​ పనులన్నీ పూర్తి చేయాలని పలువురు కోరుతున్నారు. ఇప్పుడు పనులు చేస్తేనే నెక్స్ట్​అడ్మిషన్లు చేసుకునే పరిస్థితి ఉంటుంది. కాగా అసంపూర్తి నిర్మాణంతో పాటు పోస్టుల శాంక్షన్ ​కోసం కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.

కొసమెరుపు ఏమిటంటే ఐటీఐ ప్రిన్సిపాల్ బిల్డింగ్‌ను హ్యాండోవర్ చేసుకోవడం లేదని పంచాయతీరాజ్ అధికారులు అంటున్నారు. ఐటీఐ కాలేజీ బిల్డింగ్​తో పాటు హాస్టల్​ భవనాల నిర్మాణాలను పూర్తి చేశామని అధికారులు తెలిపారు. బిల్డింగ్​లను హ్యాండోవర్​ చేసుకోవాలని కొత్తగూడెం ఐటీఐ ప్రిన్సిపాల్​కు లేఖ రాశామన్నారు. కానీ వారు ముందుకు రావడం లేదని అధికారులు ఆరోపిస్తున్నారు.

ఐటీఐ బిల్డింగ్​అసంపూర్తిగా ఉంది. ఆ పనులను అలాగే ఉంచి తాము ఎలా హ్యాండోవర్​ చేసుకోవాలని ప్రిన్సిపల్ ప్రశ్నించారు. కాంపౌండ్​ వాల్​తో పాటు కరెంట్​ సప్లై లేదు. పోస్టుల శాంక్షన్​ విషయాన్ని ఎమ్మెల్యే, కలెక్టర్​ దృష్టికి ఇప్పటికే తీసుకెళ్లామన్నారు. ప్రభుత్వం పోస్టులను శాంక్షన్​ చేస్తే అడ్మిషన్లు స్టార్ట్​ చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. మిషనరీ, ఫర్నీచర్​ కోసం దాదాపు రూ.1.50కోట్లను కేంద్రం ఇచ్చింది. వెంటనే పనుల కంప్లీట్ ​చేయాలలని ఐటీఐ ప్రిన్సిపల్ కోరారు. ఈ విద్యా సంవత్సరం నుంచి అయిన విద్యార్థులకు ఐటీఐ విద్యను అందించాలని విద్యార్థి సంఘాలు, నాయకులు కోరుకుంటున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button