భద్రాద్రి కొత్తగూడెం ఐటీఐ కాలేజ్కు మోక్షమెప్పుడు

భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో గిరిజన విద్యార్థులకు సాంకేతిక విద్య అందని ద్రాక్షగా మారింది. జిల్లాలో రూ.5.5కోట్లతో కట్టిన స్పెషల్ఐటీఐ బిల్డింగ్ను నిరుపయోగంగా పెట్టారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోని స్టూడెంట్స్ నక్సల్స్ వైపు ఆకర్షించకుండా ఏడేండ్ల కిందట జిల్లాకు కేంద్రం స్పెషల్ ఐటీఐని శాంక్షన్ చేసింది.
గిరిజన పిల్లలకు టెన్నికల్ ఎడ్యుకేషన్ పూర్తిస్థాయిలో ఫ్రీగా అందించేందుకు స్పెషల్ ఐటీఐ బిల్డింగ్తో పాటు హాస్టల్కు రూ. 5.5కోట్లను కేంద్రం రిలీజ్ చేసింది. చుంచుపల్లి మండలంలో బిల్డింగ్ నిర్మాణ పనులను పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టారు. ఏడాదిన్నర కిందట బిల్డింగ్ పూర్తయినా ఇప్పటి వరకు అందుబాటులోకి తీసుకురావడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు.
స్పెషల్ ఐటీఐ కాలేజ్ బిల్డింగ్తో పాటు ల్యాబ్లు, హాస్టల్ భవనాలను నిర్మించిన పంచాయతీరాజ్ ఆఫీసర్లు కాంపౌండ్ వాల్ నిర్మాణాన్ని మర్చిపోయారు. కరెంట్ సప్లై ఇవ్వలేదు. హాస్టల్ బిల్డింగ్ ముందు కందకాలు పూడ్చలేదు. కానీ బిల్డింగ్ పూర్తి అయినట్టుగా చెబుతూ హ్యాండోవర్ చేసుకోవాలని కొత్తగూడెంలోని ఐటీఐ ప్రిన్సిపాల్పై ఒత్తిడి తెచ్చారు. పనులన్నీ పూర్తి చేస్తేనే హ్యాండోవర్ చేసుకుంటానని ప్రిన్సిపాల్ ఖరాఖండిగా చెప్పారు. ఈ క్రమంలో కాలం గడుస్తోంది తప్ప క్లాసులు నిర్వహించేందుకు బిల్డింగ్ అందుబాటులోకి రావడం లేదు.
ఫలితంగా కోట్లతో నిర్మించిన బిల్డింగ్ లు అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా మారింది. నిత్యం మందుబాబులు అక్కడ సిట్టింగ్వేస్తున్నారు. ఈ క్రమంలో వెంటనే పెండింగ్ పనులన్నీ పూర్తి చేయాలని పలువురు కోరుతున్నారు. ఇప్పుడు పనులు చేస్తేనే నెక్స్ట్అడ్మిషన్లు చేసుకునే పరిస్థితి ఉంటుంది. కాగా అసంపూర్తి నిర్మాణంతో పాటు పోస్టుల శాంక్షన్ కోసం కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.
కొసమెరుపు ఏమిటంటే ఐటీఐ ప్రిన్సిపాల్ బిల్డింగ్ను హ్యాండోవర్ చేసుకోవడం లేదని పంచాయతీరాజ్ అధికారులు అంటున్నారు. ఐటీఐ కాలేజీ బిల్డింగ్తో పాటు హాస్టల్ భవనాల నిర్మాణాలను పూర్తి చేశామని అధికారులు తెలిపారు. బిల్డింగ్లను హ్యాండోవర్ చేసుకోవాలని కొత్తగూడెం ఐటీఐ ప్రిన్సిపాల్కు లేఖ రాశామన్నారు. కానీ వారు ముందుకు రావడం లేదని అధికారులు ఆరోపిస్తున్నారు.
ఐటీఐ బిల్డింగ్అసంపూర్తిగా ఉంది. ఆ పనులను అలాగే ఉంచి తాము ఎలా హ్యాండోవర్ చేసుకోవాలని ప్రిన్సిపల్ ప్రశ్నించారు. కాంపౌండ్ వాల్తో పాటు కరెంట్ సప్లై లేదు. పోస్టుల శాంక్షన్ విషయాన్ని ఎమ్మెల్యే, కలెక్టర్ దృష్టికి ఇప్పటికే తీసుకెళ్లామన్నారు. ప్రభుత్వం పోస్టులను శాంక్షన్ చేస్తే అడ్మిషన్లు స్టార్ట్ చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. మిషనరీ, ఫర్నీచర్ కోసం దాదాపు రూ.1.50కోట్లను కేంద్రం ఇచ్చింది. వెంటనే పనుల కంప్లీట్ చేయాలలని ఐటీఐ ప్రిన్సిపల్ కోరారు. ఈ విద్యా సంవత్సరం నుంచి అయిన విద్యార్థులకు ఐటీఐ విద్యను అందించాలని విద్యార్థి సంఘాలు, నాయకులు కోరుకుంటున్నారు.