ఆంధ్ర ప్రదేశ్

Nara Lokesh: శ్రీసిటీకి ఎయిర్‌పోర్టుతో డైరెక్ట్ కనెక్టివిటీ ఇస్తాం

Nara Lokesh: అంతర్జాతీయస్థాయి గృహోపకరణాల తయారీ సంస్థ ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ శ్రీసిటీ యూనిట్‌కు మంత్రి నారా లోకేశ్‌ ఇవాళ భూమిపూజ చేశారు. ఎల్‌జీ యూనిట్ నిర్మాణానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామ‌ని లోకేష్ అన్నారు. ఇక్కడ అనుబంధ యూనిట్లతో పాటు ఎల్‌జీ సిటీ నిర్మించాల‌ని కోరారు. రాబోయే నాలుగేళ్లలో శ్రీసిటీకి తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయంతో డైరెక్ట్ కనెక్టివిటీ కల్పిస్తామ‌ని తెలిపారు.

పరస్పర విశ్వాసం, ఉమ్మడి శ్రేయస్సు, ప్రపంచాన్ని అనుసంధానించే సమష్టి లక్ష్యంతో కూడిన ఈ భాగస్వామ్యాన్ని కొనసాగిద్దామ‌ని ఎల్‌జీ సంస్థ ప్ర‌తినిధుల‌తో మంత్రి అన్నారు. ఒక ప్రతిష్ఠాత్మకమైన యూనిట్ ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్‌ను ఎంచుకున్న ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ కు ధన్యవాదాలు తెలియ‌జేశారు. ఎల్‌జీ ఫ్యాక్టరీ ప్రతి యువ ఇంజనీర్, ప్రతి ఆశావహ సాంకేతిక నిపుణుడు, ప్రతి వ్యవస్థాపకుడికి కలల కర్మాగారంగా మారబోతోందని మంత్రి లోకేశ్‌ పేర్కొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button