Hyderabad: వాల్ పెయింటింగ్స్.. మన దేశ సంస్కృతి ఉట్టిపడేల కళారూపాలు

Hyderabad: హైదరాబాద్ మహానగరానికి మణిహారంగా ఉన్న ఫ్లైఓవర్లు, అండర్పాస్లు, హైవేలకు ఆధునిక హంగులు అద్దుతున్నారు. సందరమైన పెయింటింగ్స్తో మరింత ఆధునీకరిస్తున్నారు. సీఎం రేవంత్ ఆదేశాలతో బ్యూటిఫికేషన్ పనులు చేపడుతున్నారు. నగరంలోని రహదారుల్లో రద్దీ పెరిగిన నేపథ్యంలో వాహనదారులను ఆకట్టుకునేలా పచ్చదనం, అపురూప శిల్పాలు, పెయింటింగ్స్ వంటివి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
హైదరాబాద్ పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది సాంస్కృతిక వారసత్వాన్ని చాటిచెప్పే ప్రయత్నంలో మున్సిపల్ కార్పొరేషన్ అనుబంధ ప్రభుత్వ శాఖల సహకారంతో హైదరాబాద్లో వాల్ పెయింటింగ్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. తెలంగాణ రాష్ట్ర గిరిజన కళారూపాల గొప్ప జానపద కళల వారసత్వం, వైభవాన్ని వర్ణించి ఆకట్టుకునే చిత్రాలను ఈ ప్రాజెక్ట్ నిర్వహించింది.
ప్రాజెక్టు పరిధిలోని ఫ్లైఓవర్ గోడల, అండర్పాస్లు, హైవేలపై కొమ్ము కోయ గిరిజన నృత్య రూపాలతో పాటు ప్రసిద్ధ బోనాలు, ఇతర జానపద కళారూపాలను హైలైట్ చేస్తూ ఆకట్టుకునే పెయింటింగ్లు వచ్చాయి. పట్టణంలోని ప్రధాన జంక్షన్లు, ఇతర ప్రాంతాల్లో దశలవారీగా పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక వారసత్వాన్ని చాటిచెప్పేలా ప్రాజెక్టును అమలు చేశాలు. పట్టణంలోని ప్రధాన కేంద్రాల్లో గోడలపై తెలంగాణ సంస్కృతికి సంబంధించిన ఆట పాటలు, రైతుల వ్యవసాయ పనులను చిత్రించారు. ఈ కళాకృతులు నగర అందాన్ని మెరుగుపరచడమే కాకుండా సందర్శకులకు సానుకూల అనుభూతిని కలిగించేలా ఉన్నాయి.
ఆర్టెరియా అనేది ప్రభుత్వ, ప్రైవేట్ , సహకార సంస్థల గోడలు, కంచెలను సృజనాత్మకంగా కాన్వాస్లుగా మార్చడం లక్ష్యంగా పెట్టుకుంది. మొదటి రెండు దశలు 2015,2016లో జరిగాయి. దీని ఫలితంగా అనేకమంది కళాకారులు 25-బేసి పెయింటింగ్లు గీశారు. ప్రస్తుతం నగరంలో ఉన్న అండర్పాస్, ఫ్లైఓవర్ల వద్ద ఖాళీ స్థలాల్లో పచ్చని మొక్కలతో సుందరీకరణ పనులు చేపడుతున్నారు. ముఖ్యంగా ఎల్బీనగర్ నుంచి గచ్చిబౌలి, శంషాబాద్ వరకు రాత్రివేళల్లో మిరుమిట్లు గొలిపేలా ప్రత్యేకంగా బౌల్డర్స్ లైటింగ్స్ పనులు చేపట్టారు. ఇప్పటికే ఈ మార్గంలో సెంట్రల్ మీడియన్లో 24 కి.మీ పొడవునా వీధి దీపాలను ఏర్పాటు చేశారు. హైదరాబాద్లో ఒక్కో ప్రాంతాన్ని ఒక్కోలా ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నారు. ఇందుకోసం కోట్లాది రూపాయలను హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ వెచ్చిస్తోంది.
గచ్చిబౌలి నుంచి శంషాబాద్ మధ్య 2 కోట్ల వ్యయంతో 4.5 కి.మీ మేర రాక్లైటింగ్ను ఏర్పాటు చేశారు. రాత్రివేళల్లో ఈ ప్రాంతంగుండా ప్రయాణించే వారి మనసును దోచుకుంటుంది. పటాన్చెరువు, మేడ్చల్ కండ్లకోయ, దుండిగల్, ఇటు కూకట్పల్లి, బాలాపూర్, బాలానగర్, మల్కాజ్గిరి, ముషీరాబాద్, నాంపల్లి, సికింద్రాబాద్, ఎల్బీనగర్లో రకరకాల ఆకృతులతో పెయింటింగ్లలో ప్రయాణికులకు ఉల్లాసాన్ని కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. హైదరాబాద్ అంటేనే ఔరా అనిపించేలా చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.